Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం - కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

road accident
, సోమవారం, 1 ఆగస్టు 2022 (08:33 IST)
హైదరాబాద్ నగరంలో కారు ప్రమాదం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సత్తంరాయిలో గత రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
బాధితురాలు స్థానిక విమానాశ్రయం నుండి ఇంటికి వెళుతుండగా ఈ విషాదం జరిగింది కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
 
సమాచారం విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్టు : శివసేన అంతానికి కుట్ర!