Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

తెలంగాణ హైకోర్టుకు కొత్తా 12 మంది న్యాయమూర్తులు

Advertiesment
Telangana High Court
, బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:27 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జీలుగా కొలీజియం ప్రతిపాదించింది. 
 
న్యాయవాదులుగా కాసోజు సురేందర్, చాడా విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫియుల్లా బేగ్, నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్‌ల పేర్లు ఉన్నాయి. 
 
అలాగే న్యాయవాదులుగా ఉన్న వారిలో జి.అనుపమ చక్రవర్తి, ఎంజి.ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డి.నాగార్జున పేర్లను కొలీజియం సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు. ఈ పేర్లన రాష్ట్రపతికి పంపించగా ఆయన పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 15 నుంచి అస్సాంలో స్కూల్స్ ప్రారంభం