Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం సతీమణి శోభకు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

shoba kcr
, ఆదివారం, 12 మార్చి 2023 (16:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు సతీమణి శోభ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమెకు కొన్ని వైద్యు పరీక్షల తర్వాత చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రులు కేటీఆర్, మంత్రి హరీశ్ రావులు ఆస్పత్రిలోనే ఉన్నారు. తన భార్య శోభతో పాటు సీఎం కేసీఆర్ కూడా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కేసీఆర్‌కు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే, వీరిద్దరి వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 
మరోవైపు, తన తల్లి అస్వస్థతకు లోనయ్యారన్న వార్తను తెలుసుకున్న ఎమ్మెల్సీ కె.కవిత హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసానికి ఆమె చేరుకున్నారు. మరోవైపు, శోభ ఆరోగ్యం నిలకడగానే వుంది. అయినప్పటికీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు ఆస్పత్రిలోనే ఉన్నారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా పాల్గొన్నారు. ఇందులో ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈ విచారణలో ఏం జరిగిందనే దానిపై వారు చర్చించినట్టు సమాచారం. అలాగే, ఈ నెల 16వ తేదీన కవితను మరోమారు విచారణకు రావాలని ఈడీ కోరింది. ఇంతలోనే శోభ అస్వస్థతకు లోనుకావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రయాణికులకు చేదువార్త.. 70 కేజీల బరువు దాటితే పైసలు చెల్లించాల్సిందే..