Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో సాగుతున్న జోడో యాత్ర.. పోటెత్తిన ప్రజలు

rahul gandhi
, సోమవారం, 31 అక్టోబరు 2022 (09:51 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముమ్మరంగా సాగుతోంది. సోమవారానికి ఈ యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్రకు తెలంగాణ ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. సోమవారం ఏకంగా 28 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర కొనసాగనుంది. 
 
షాద్ నగర్ నుంచి ముచ్చింతల్ దగ్గర పెద్ద షాపూర్ వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. కొత్తూరులో మధ్యాహ్న భోజన విరామం ఇస్తారు. సాయంత్రం 7 గంటల వరకు ముచ్చింతల్ దగ్గర రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ జరుగుతుంది. 
 
రాత్రికి శంషాబాద్ శివారు తండుపల్లి దగ్గర బస చేస్తారు. కాగా, రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై 54వ రోజుకు చేరుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్ పదవీకాంక్ష కోసం పనిచేసి... ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్