Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో కరోనా కల్లోలం - కేరళ నుంచి నర్సులు

తెలంగాణాలో కరోనా కల్లోలం - కేరళ నుంచి నర్సులు
, ఆదివారం, 28 జూన్ 2020 (16:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులకో కిటకిటలాడిపోతున్నాయి. మరోవైపు, సుశిక్షితులైన నర్సులకు కూడా కొరత ఏర్పడింది. దాంతో హైదరాబాదులోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు కేరళ నుంచి హుటాహుటీన 50 మంది నర్సులను చార్టర్డ్ విమానాల్లో తీసుకువచ్చాయి. 
 
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నర్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. వారికి అధిక వేతనాలను ఇచ్చేందుకు కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి. దీనిపై తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా నర్సులకు ఇచ్చే జీతానికి ఇది మూడు రెట్లు ఎక్కువని అన్నారు. నర్సులు కావాలంటూ తమకు రోజుకు 10 నుంచి 15 కాల్స్ వరకు వస్తున్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో మరో 755 కరోనా పాజిటివ్ కేసులు