Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:47 IST)
శరీరం విసర్జించేవాటిని అదిమిపెట్టడం వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. అలాంటిదే జరిగింది. తెలంగాణ లోని వికారాబాద్ జిల్లా లోని దౌల్తాబాద్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాములు బుధవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
 
ఆ బస్సు అతడు ఎక్కిన చోట నుంచి అరగంట పాటు ప్రయాణించిన తర్వాత తనకు అర్జెంటుగా మూత్రం వస్తోందని, బస్సు ఆపాలని డ్రైవర్ కి అరిచి చెప్పాడు. సర్లే... బస్సు పక్కనే ఆపుతానని అని చెప్పేలోగానే కదిలే బస్సు నుంచి తెరిచి వున్న బస్సు ద్వారం నుంచి బయటకు దూకేశాడు.
 
అలా అతడు బలంగా దూకడంతో అతడి తల నేలను గట్టిగా కొట్టుకుంది. దానితో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో కరోనా టీకా వేసిన పారిశుద్ధ్య కార్మికుడు మృతి, అతడికి అవి వున్నాయట