Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Advertiesment
crime

ఐవీఆర్

, శనివారం, 31 మే 2025 (16:16 IST)
బంగారం కోసం ఓ మహిళను గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పరిధిలో జరిగింది. ఈ దారణ ఘటన పట్టపగలే చోటుచేసుకోవడంతో స్థానికంగా భయభ్రాంతులకు కారణమవుతోంది.
 
పూర్తి వివరాలు చూస్తే... హతురాలు బాల లక్ష్మి, భర్త సుధాకర్ దంపతులు. బాల లక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా భర్త సుధాకర్ ఆటో నడుపుతుంటాడు. ఐతే శుక్రవారం మధ్యహ్నానం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరపడ్డారు. ఆమె మెడలో వున్న రెండు వరసల బంగారు పుస్తెల తాడు కోసం గొంతు కోసి హత్య చేసారు. ఆమె మెడలో బంగారంతో పాటు 5 తులాల బంగారాన్ని కూడా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను గొంతు కోసి హత్య చేసినవారు బంగారం కోసమే హత్య చేసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక విషయాలు తెలియజేస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు