Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతును తొక్కి చంపేసిన అడవి ఏనుగు.. ఎక్కడ?

Advertiesment
elephant

సెల్వి

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:54 IST)
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఓ రైతును అడవి ఏనుగు తొక్కి చంపినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రలోకి ప్రవేశించిన మంద నుంచి విడిపోయిన ఏనుగు కౌతాల మండలం బూరేపల్లె గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది.
 
ఈ ఘటనలో అల్లూరి శంకర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఏనుగు సంచారం వుండటంతో ఆ ప్రాంత ప్రజలకు బీభత్సం సృష్టించింది. తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మగ ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. 
 
రెండు రోజుల క్రితం గడ్చిరోలి అడవుల్లోకి ప్రవేశించిన మందలో కొంత భాగం ప్రాణహిత నదిని దాటి తెలంగాణ గ్రామంలోకి ప్రవేశించిందన్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి అటవీశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత కారు లేని రాహుల్... ఆస్తులు ఎంతో తెలుసా?