Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండెక్టర్

Advertiesment
Pregnant

సెల్వి

, సోమవారం, 19 ఆగస్టు 2024 (16:25 IST)
గద్వాల్-వనపర్తి మార్గంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ గర్భిణికి మహిళా కండక్టర్, నర్సు సహాయంతో పురుడు పోసింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
సోమవారం ఉదయం గద్వాలకు చెందిన సంధ్య అనే గర్భిణి పల్లె వెలుగు బస్సులో రక్షా బంధన్ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి.
 
మహిళా కండక్టర్ జి భారతి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సుతో పాటు కండక్టర్ గర్భిణిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ఈ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించిన మహిళా కండక్టర్‌ను యాజమాన్యం తరపున టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తుల అఘాయిత్యం!