Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

Advertiesment
TGSRTC
టీజీఎస్సార్టీసీ తన నగర బస్సుల సముదాయానికి బుధవారం నాడు మరో 60 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడానికి సిద్ధమైంది. ఈవీఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 500 బస్సులను బరిలోకి దించనుంది. 
 
ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా, టీజీఎస్సార్టీసీ ఇప్పటికే కంటోన్మెంట్, హెచ్‌సీయూ, మియాపూర్, హయత్‌నగర్, రాణిగుంజ్ ఇతర డిపోల నుండి 440 లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ నగర బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల సౌకర్యం, పర్యావరణ అనుకూల లక్షణాల కారణంగా ప్రయాణికుల నుండి వీటికి విశేష ఆదరణ లభించింది. 
 
ప్రస్తుతం, ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులు ఈ బస్సులను వినియోగిస్తున్నారు. అదనంగా మరో 60 బస్సులను ప్రవేశపెట్టడంతో, రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 1.2 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్