Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రూప్‌-1 పరీక్షల రీషెడ్యూల్‌ కోసం నిరసన.. లాఠీ ఛార్జ్, ఉద్రిక్తత

Hyderabad

సెల్వి

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (22:29 IST)
Hyderabad
గ్రూప్‌-1 పరీక్షల రీషెడ్యూల్‌ కోసం నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు అభ్యర్థులకు గాయాలయ్యాయి. 
 
నిరసనకారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ ఉత్తర్వు (GO) 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. 
 
నిరసనలను కట్టడి చేసేందుకు పలువురు అభ్యర్థులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు.
 
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు పలువురు కరీంనగర్‌లోని బండి సంజయ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయడంలో తమకు సాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా గ్రూప్స్ అభ్యర్థుల నిరసనకు బండి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల విషయంలో రేవంత్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ఇండియా విమానానికి బెదిరింపులు, బ్రిటన్ ఫైటర్ జెట్స్ తోడు రాగా లండన్‌లో ప్రయారిటీ ల్యాండింగ్