Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద బాధితుల కోసం.. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రూ.100 కోట్లు విరాళం

telangana state

సెల్వి

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (16:03 IST)
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ తమ ఒకరోజు మూల వేతనాన్ని వరద బాధితుల సహాయానికి వెచ్చించాలని కోరుతూ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. సాధారణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనాన్ని ట్రెజరీకి అందజేస్తామని జేఏసీ ప్రకటించింది. సెప్టెంబరు నెలలో చెల్లించాల్సిన మొత్తంలో కోత విధించి, ట్రెజరీకి జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ విరాళం రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం.
 
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేటా ప్రకటించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం సహాయాన్ని కోరుతోంది.
 
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేంద్రం నుంచి రూ.2,000 కోట్ల సాయం అందించాలని సీఎం కోరారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, పంటలు దెబ్బతిన్నాయి, రోడ్డు, రైల్వే మార్గాలు దెబ్బతిన్నాయి. కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నీరు ప్రవహించడంతో పలు లారీలు నిలిచిపోయాయి. రోడ్డు మీద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పొరుగు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా రేవంత్ రెడ్డితో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుని తెలంగాణకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు.. సహకరించని అధికారులు.. 4 రోజులుగా ఆ శవం అక్కడే