Publish Date: Sat, 13 Jun 2026 (22:18 IST)
Updated Date: Sat, 13 Jun 2026 (22:25 IST)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, ఒక సాధారణ రాజకీయ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం పూర్తి స్థాయి ప్రాంతీయ అంశంగా మారింది. అయితే, తదుపరి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సంయమనం పాటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఈ వివాదం మొదలైన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం పూర్తిగా భద్రతా కారణాలు శాంతిభద్రతల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ అసహనం ఆరోపణలను తోసిపుచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించడానికి, రాష్ట్రవ్యాప్తంగా తిరగడానికి, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉన్నారన రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సందర్భాల్లో బహిరంగ సభలకు అనుమతి నిరాకరించారు. అప్పుడు ఆ అనుమతులు ఎందుకు నిరాకరించారో పవన్ కళ్యాణే స్వయంగా వివరణ ఇవ్వాలని
రేవంత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు.
వ్యక్తిగత విమర్శలు, ప్రాంతీయ రాజకీయ అంశాలపై కూడా మాట్లాడారు. తన రాజకీయ శైలిపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు స్పందిస్తూ, నియంతృత్వ ధోరణి గల వ్యక్తులతో తనను పోల్చడాన్ని ఆయన రేవంత్ ఖండించారు. అడాల్ఫ్ హిట్లర్ తన ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో జీవించే ఎవరైనా హిట్లర్ తమ ఆదర్శమని అంటారా అంటూ ప్రశ్నించారు.