Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్నటికి నిన్న చిరుత పులి.. నేడు నాగర్ కర్నూలులో కొండచిలువ

python

వరుణ్

, ఆదివారం, 21 జులై 2024 (08:58 IST)
python
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ సమీపంలోని పాత సరుకుల గోదాము ముందు కొండచిలువ ఉన్నట్లు స్థానిక కాలనీ వాసులు గుర్తించారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున కొండచిలువ కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను పట్టుకుని అడవిలోకి వదలాలని స్థానికులు కోరుతున్నారు.
 
మరోవైపు నిన్నటికి నిన్న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది.  తాజాగా రాములు అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిలన క్రమంలో చిరుత పులి కనిపించింది. 
 
తన సెల్‌ఫోన్‌లో చిరుతను వీడియో తీసి గ్రామస్తులకు చేరవేశాడు. నల్లమల చిరుతలు ఆహార వేటలో భాగంగా పొలాలు, గ్రామాల వైపు వస్తున్నాయని దీంతో తమతో పాటు పశు సంతతికి ప్రాణహానీ నెలకొందని వారు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతి తలలో 70 సూదులు.. పుర్రెలోకి దిగలేదు.. ప్రాణాపాయం తప్పింది..