Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆహారంలో బల్లి, ఎలుక తర్వాత.. ఇప్పుడేమో సాంబారులో పురుగులు

Advertiesment
sambar

సెల్వి

, శుక్రవారం, 19 జులై 2024 (17:53 IST)
ఆహారంలో చనిపోయిన బల్లి, ఎలుక తర్వాత గురువారం జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలోని బాలికల హాస్టల్‌లో సాంబారులో పురుగులు కనిపించాయి. 
 
ఒక విద్యార్థి సాంబారులో పురుగులను గమనించి ఇతర విద్యార్థులను అప్రమత్తం చేయడంతో వారు వార్డెన్‌కు సమాచారం అందించారు. వెంటనే సాంబార్ స్థానంలో మరో వంటకం పెట్టాలని వార్డెన్ హాస్టల్ ఇన్ చార్జిని కోరారు. 
 
హాస్టల్‌ను సందర్శించిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ యాదగిరి సాంబార్‌లో పురుగులను గమనించి ఘటనపై విచారణకు ఆదేశించారు. గత 15 రోజుల్లో ఇది రెండో ఘటన. జూన్ 21న అల్పాహారంలో చనిపోయిన బల్లి కనిపించింది. ప్రస్తుతం విద్యార్థులకు రాత్రి భోజనంలో పురుగులతో కూడిన సాంబారు వడ్డించారు.
 
యూనివర్శిటీ హాస్టళ్లలో నాసిరకం ఆహారాన్ని అందజేస్తున్నారని, విశ్వవిద్యాలయ పరిపాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. 
 
పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, ఆహారం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విశ్వవిద్యాలయ పరిపాలన విఫలమైందని విద్యార్థులు ఆరోపించారు. 
 
సరైన తిండి లేకుండా నాసిరకం ఆహారంతో ఇబ్బంది పడుతున్నామని.. బయటి ఆహారం తెచ్చుకోనివ్వట్లేదని.. దీంతో చాలామంది  విద్యార్థులు ఆకలితో పస్తులుంటున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 23 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైకాపాలో కరువైన ఫైర్ బ్రాండ్స్