Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

Advertiesment
Ponguleti

సెల్వి

, శనివారం, 26 జులై 2025 (20:07 IST)
Ponguleti
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. చారిత్రాత్మక వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్నదే ప్రభుత్వ సంక‌ల్పమన్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 
 
వ‌రంగ‌ల్ ప్రాంత ప్రజల చిర‌కాల స్వ‌ప్నం మామునూరు ఎయిర్ పోర్ట్ త్వ‌ర‌లో సాకారం కానుందని మంత్రి తెలిపారు. 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో వ‌రంగ‌ల్ నగరంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవ‌స్ధ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 
 
యుద్ధ ప్రాతిప‌దికన ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ చేపడుతామని, ఇందుకోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిందని పొంగులేటి చెప్పుకొచ్చారు. వరంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన  భూమి గుర్తింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
 
అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు పొంగులేటి. ఇండ్లను పూర్తిచేసుకోవ‌డానికి ప్రభుత్వమే ల‌బ్దిదారుల‌కు ఆర్ధిక స‌హాయం చేస్తుందన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆగస్టు 15లోపు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ప్రాధన్యత ఇవ్వాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?