Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

Advertiesment
Kalvakuntla kavita

సెల్వి

, శుక్రవారం, 23 మే 2025 (22:27 IST)
బీఆర్ఎస్ నేత కవిత తెలంగాణలో మరో షర్మిలగా మారే అవకాశం వుందని రాష్ట్రంలో చర్చ జరుగుతోందని బిజెపి ఎంపి రఘునందన రావు అన్నారు. కవిత తన తండ్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాలో లీక్ అయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ పంచాయితీనా లేక ఆస్తి సంబంధిత పంచాయితీనా లేక కుటుంబ పంచాయితీనా అని ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారని రఘునందన రావు అన్నారు. 
 
బీఆర్ఎస్ నేత కవిత మే 2న అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు ఈ లేఖ రాశారు. కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే అనేక ప్రశ్నలు లేవనెత్తినందున ఇది విస్తృతంగా చర్చనీయాంశమైంది. అలాగే, బీఆర్ఎస్ ప్లీనరీలో, కేటీఆర్ తన రాజకీయ వారసురాలు అవుతారని కేసీఆర్ స్పష్టంగా సూచించారు. 
 
ఈ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ గూటిలోకి వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ లేఖ వెనుక సీఎం హరీష్ రావు ఉన్నారా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంతలో, కేటీఆర్, హరీష్ రావు తాము ఒకటేనని చూపించుకోవడానికి కలిశారని రఘునందన్ రావు ఒక సోషల్ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రజలు తెలంగాణలో తదుపరి ఎంపికగా బీజేపీ వైపు చూస్తున్నారని రఘునందన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?