తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన లేడీ అఘోరీ మీడియాతో మాట్లాడుతూ... తనను కావాలనే కొంతమంది ఇరికించారంటూ వాపోయింది. తనకు ఏవో కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటూ కొంతమంది ప్రచారం చేసారనీ, అంత డబ్బు నా దగ్గర వుంటే నేను విల్లాలు కొనుక్కుంటాననీ, నా తల్లిదండ్రులను వాటిలో వుంచేదానినంటూ చెప్పుకొచ్చింది.
నేను ఎవరినో మోసం చేసానంటూ ఆరోపిస్తున్నారు. పురుషుడికి వుండే కష్టాలు ఏమిటో నాకు తెలుసు. అలాగే మహిళకు వుండే ఇబ్బందులు కూడా తెలుసు. అందుకే నేను శస్త్ర చికిత్స చేయించుకున్నా. నేను మగవాడిని కాదు, స్త్రీని కాదు. నాకు ఏదీ లేదు. అలాంటప్పుడు నేను సంసారానికి ఎలా పనికి వస్తానంటూ ప్రశ్నిస్తోంది లేడీ అఘోరి. తనకు పోలీసులు, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం వుందనీ, వాస్తవాలు బయటకు వస్తాయని, అన్ని కేసుల నుంచి తను బైటపడతానంటూ వెల్లడించింది.