Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

Advertiesment
Balasubrahmanyam statue

సెల్వి

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (22:20 IST)
Balasubrahmanyam statue
రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. అయితే తెలంగాణలో బాలు విగ్రహ ఏర్పాటు అంశం తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. డిసెంబర్ 15వ తేదీన ఎస్పీబీ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్పీబీకి రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో విగ్రహం ఎందుకని తెలంగాణ ఉద్యమ కారుడు పృథ్వీరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 
 
తెలంగాణ కళాకారులు గద్దర్, అందెశ్రీ వంటి వారి విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్‌తో పాటు పృథ్వీరాజ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?