Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Advertiesment
revanth reddy

ఠాగూర్

, శుక్రవారం, 21 మార్చి 2025 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ అధికారులను అడుక్కోవడం ఏమిటని తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్నారు. తిరుమలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలని ఆయన సూచించారు. 
 
తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని, తితిదే అధికారులను అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరి గుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. 
 
తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణాలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇపుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల