Publish Date: Wed, 18 Feb 2015 (09:49 IST)
Updated Date: Wed, 18 Feb 2015 (09:50 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మహారాష్ట్రలో బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. మహారాష్ట్ర రాజ్భవన్లో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్గంగ ఇచ్చంపల్లి చెక్డ్యాంలపై చర్చించారు.
ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, జోగురామన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు హాజరయ్యారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తన జన్మదిన వేడుకలను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్ భవన్లో జరుపుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, వినోద్, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తదితరుల సమక్షంలో కేసీఆర్ తన బర్త్ డే కేక్ను కట్ చేశారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు.