Publish Date: Fri, 01 Dec 2023 (20:16 IST)
Updated Date: Fri, 01 Dec 2023 (20:19 IST)
గెలుస్తారని భావిస్తున్న ఎమ్మెల్యేలను (ఎగ్జిట్ పోల్ అంచనాలు) కాపాడుకోవడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వేరే ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారు.
గెలుపొందిన ఎమ్మెల్యేలను బెంగళూరుతో పాటు మరో నగరానికి తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం కౌంటింగ్ ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీ 70 లోపు సీట్లకే పరిమితమైందని, అయితే ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఉంచుతారని ప్రచారం జరుగుతోంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే ప్రధాన పార్టీల మధ్య గెలుపొందే అభ్యర్థుల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉందని తేలింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 సీట్లు సాధించాలి.
సెల్వి
Publish Date: Fri, 01 Dec 2023 (20:16 IST)
Updated Date: Fri, 01 Dec 2023 (20:19 IST)