Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#TelanganaElectionResults : రేవంత్ - సుహాసినలపై బెట్టింగ్స్

#TelanganaElectionResults : రేవంత్ - సుహాసినలపై బెట్టింగ్స్
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:33 IST)
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి వెంకట సుహాసినలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బెట్టింగులు, పందేలు నడుస్తున్నాయి. రేవంత్‌ను కొడంగల్‌లో ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
 
ఐటీ దాడులు, ఈడీ దాడులు, అక్రమంగా అరెస్టులు అంటూ రేవంత్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినా గెలుపుపై రేవంత్  రెడ్డి ధీమాగా ఉన్నారు. కనీసం 30 వేల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే రేవంత్ రెడ్డి గెలుపు, ఓటములపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వంద కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు వినికిడి. అలాగే, కూకట్‌పల్లి తీర్పుపైనా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రిజల్ట్స్ : ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందంటే...