కావలసినవి :
బొంబాయిరవ్వ : పావుకిలో
వేయించిన శనగపిండి : పావుకిలో
పంచదార : అరకిలో
నెయ్యి : 200 గ్రాములు
జీడిపప్పు : 50 గ్రాములు
యాలకులు : 6
ఎండుకొబ్బరి : 1 చిప్ప (కోరి వుంచాలి)
ఇలా చేయండి :
ముందుగా జీడిపప్పును కొద్ది నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నేతిలో రవ్వను వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే రోటిలో దంచాలి. పంచదారలో కొద్దిగా నీటిని పోసి తీగపాకం పట్టి, ఆ పాకంలో అన్నీ కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరగిపోయేలా ఉంటుంది. ఆవకాయలాగా ఆంధ్రులకు రవ్వలడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదుగదా మరి..