కావలసిన పదార్థాలు :
జీడిపప్పు... పావు కేజీ
పంచదార పొడి... 300 గ్రా.
ఆకుపచ్చ లేదా నారింజ లిక్విడ్ ఫుడ్కలర్... ఒక గ్రా.
లవంగాలు... సరిపడా
నెయ్యి... 50గ్రా.
తయారీ విధానం :
జీడిపప్పును 2 గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా ముద్దగా అయ్యేవరకూ రుబ్బాలి. ఓ బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ ముద్ద వేసి సన్నమంటమీద కొంచెం దగ్గర పడేవరకూ ఉడికించి దించాలి. తరవాత లిక్విడ్ ఫుడ్ కలర్, పంచదార పొడి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టి యాపిల్, జామ... వంటి పండ్ల ఆకారంలో చేయాలి. చివరగా మీకిష్టమైన రంగును బ్రష్తో అద్ది లవంగాలు గుచ్చితే ముంతమామిడి (జీడిపప్పు) పండ్లు సిద్ధమైనట్లే...!