కావలసిన పదార్థాలు :
పొడిబియ్యం... ముప్పావు కేజీ
మినప్పప్పు... పావు కేజీ.
బెల్లం.... ఒక కేజీ
నెయ్యి... 300 గ్రా.
తయారీ విధానం :
బియ్యాన్ని సన్నటి సెగమీద బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి, కొద్దిగా చల్లారిన తరవాత మెత్తగా గ్రైండ్ చేయాలి. మినప్పప్పుని కూడా కమ్మని వాసన వచ్చేదాకా వేయించి తీయాలి. చల్లారిన తరవాత మెత్తగా పొడి చేయాలి. బెల్లాన్ని సన్నగా తురమాలి.
ఇప్పుడు మినప్పప్పు, బియ్యం పొడుల్ని కలిపి అందులోనే బెల్లం, నెయ్యి వేసి మరోసారి కలిపి.. సున్నుండలు చేసినట్లే చేయాలి. అచ్చంగా మినప్పప్పుతో చేసే సున్నుండలకి భిన్నమైన రుచి కలిగిన ఈ వెరైటీ ఉండలను అతిథులకి అందించండి. అంతే బూడిద గుమ్మడి గుల్ఖండ్ సిద్ధమైనట్లే...!!