కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం : ఐదు టేబుల్ స్పూన్లు
పాలు : 1/2 లీటరు
యాలకుల పొడి : ఒక టీస్పూన్
కుంకుమపువ్వు : చిటికెడు
చక్కెర : 100 గ్రాములు
నెయ్యి : 2 టీస్పూన్లు
జీడిపప్పు : 10 గిజలు
కిస్మిస్ : 10 గిజలు
బాదాం పిస్తా : 10 గిజలు
తయాలీ విధానం :
మొదట బియ్యం శుభ్రం చేసుకుని కడిగి బరకగా పొడి చేసికోవాలి. ఈ తడి బియ్యం పిండిని పాలల్లో వేసి ఉడికించాలి. చిక్కబడ్డాక చక్కెర వేసి కాస్త గట్టిపడేవరకు ఉంచుకోవాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకులు, బాదాం పిస్తా గింజలను కలపాలి. ఇది వేడిగా కాని చల్లగా కాని బావుంటుంది.