Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పప్పులో ఉండ్రాళ్ళు

Advertiesment
పప్పులో ఉండ్రాళ్ళు
, మంగళవారం, 8 జులై 2008 (19:50 IST)
కావలసిన పదార్థాలు:

పొట్టు పెసరపప్పు- 4 కప్పులు(ఉడికించి మెత్తగా మెదపాలి)
బియ్యపు పిండి-2 కప్పులు
బెలం తురుము-4 కప్పులు
నీళ్లు-తగినన్ని
జీడిపప్పు-50 గ్రాములు
పాలు- కప్పు
యాలకుల పొడి-అరటీస్పూను
పచ్చకర్పూరం పొడి-రవ్వంత
బియ్యపు పిండి-2 టేబుల్ స్పూన్లు(గుజ్జులా కలిపి ఉంచుకోవాలి)
ఎండుకొబ్బరి-100 గ్రాములు
నెయ్యి-50గ్రాములు

తయరీ విధానం:

బియ్యపు పిండిలో పాలు, కొద్దిగా బెల్లం తురుము వేసి ముద్దలా కలిపి చిన్న గోళీలంత ఉండలు చేసుకోవాలి. బెల్లంతురుములో తగినన్ని నీళ్ళు పోసి తీగపాకం రానిచ్చి అందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి ఉంచాలి. స్టవ్ మీద నీళ్ళు పెట్టి బాగా మరిగించి బియ్యపు ఉండలు, కొబ్బరి తురుము వేసి మూడు వంతులు ఉడికించి మెదిపిన పెసరపప్పు కూడా వేయాలి. తరువాత బెల్లం పాకం పోసినేతిలో జీడిపప్పు దోరగా వేయించి కలపాలి. బియ్యపుపిండి గుజ్జు కూడా పోసి 5 నిమిషాలు ఉడికించి గిన్నెదించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu