కావలసిన వస్తువులు :
మైదా పిండి - పావుకిలో
డాల్డా లేదా నెయ్యి - 50 గ్రాములు
కాజు, బాదం, కిస్మిస్, పిస్తా పప్పులు - అరకప్పు (అన్నీ కలిపి)
కోవా - అరకప్పు
ఏలకుల పొడి - అర టీ స్పూన్
లెమన్ పసుపు రంగు - మూడు చుక్కలు
చక్కెర - అరకేజీ
నూనె - వేయించడానికి తగినంత
ఉప్పు - చిటికెడు
డ్రైఫ్రూట్స్ సమోసా తయారుచేయండి ఇలా :
మొదట మైదా పిండిని జల్లించి, అందులో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరువాత అందులో తగినంత నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవానుపొడిగా చేయాలి. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మరో వైపు చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి. ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేసి, ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసివేయాలి. అంతే తియతియ్యటి డ్రైఫ్రూట్స్ సమోసా రెడీ. స్కూల్కు వెళ్లి అలసిపోయి వచ్చే పిల్లలకు ఈ డ్రైఫ్రూట్స్ సమోసా మంచి శక్తినిస్తుంది.