Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా వుంది.. అప్పటివరకు పోరాడుతా : మేరికోమ్

Advertiesment
Mary Kom
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (12:32 IST)
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 పోటీల్లో బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మేరీకోమ్ ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమి తర్వాత బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 
 
తనలో బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా ఉంద‌న్నారు. తనకు 40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతూనే ఉంటాన‌ని తెలిపారు. త‌దుప‌రి ఒలింపిక్స్‌లోనూ ఆడేందుకు తాను ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. 
 
ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాలేక‌పోయాన‌ని, ఇందుకు బాధగా ఉంద‌ని చెప్పారు. తాను ఖచ్చితంగా గెలుస్తాన‌ని భావించాన‌ని అన్నారు. తాను బాగానే ఆడిన‌ప్ప‌టికీ ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతల తీరు సరిగా లేదని చెప్పారు. 
 
మొద‌టి రెండు రౌండ్లు గెలిచినప్ప‌టికీ తాను ఎందుకు ఓడిపోతానని ప్ర‌శ్నించారు. బౌట్‌కు ముందు అధికారులు త‌న దగ్గరకు వచ్చి సొంత జెర్సీని వాడకూడదన్నారు. తొలి మ్యాచ్‌లో చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారని నిల‌దీశారు. త‌న‌ను మానసికంగా దెబ్బతీయడానికే న్యాయ నిర్ణేత‌లు అలా చేశారని భావిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన బాక్సర్