Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది.. ఓటమితో వీడ్కోలు

Serena Williams
, శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:06 IST)
Serena Williams
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా తొమ్జనోవిచ్చేతిలో పోరాడి ఓడిపోయింది. 
 
ఈ టోర్నీతో కెరీర్‌ను ముగిస్తానని సెరెనా గతంలోనే ప్రకటించింది. దాంతో, సుదీర్ఘ, అత్యంత విజయవంతమైన కెరీర్ కు సెరెనా ఓటమితో వీడ్కోలు చెప్పినట్లైంది. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత "రిటైర్మెంట్‌పై పునరాలోచన చేస్తారా?" అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు, కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. తన సుదీర్ఘ కెరీర్లో సెరెనా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్‌: పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్