Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేసియా మాస్టర్స్‌‌లో అదరగొట్టిన సైనా నెహ్వాల్.. సింగిల్స్.. డబుల్స్‌లోనూ భారత్ హవా

అంతర్జాతీయ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారాంభం చేసింది. ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో సైనా అదుర్స్ అనిపించారు. మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ ట

Advertiesment
Saina Nehwal
, గురువారం, 19 జనవరి 2017 (14:46 IST)
అంతర్జాతీయ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారాంభం చేసింది. ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో సైనా అదుర్స్ అనిపించారు. మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సైనా 21–9, 21–8తో చాసిని కొరెపాప్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. 
 
కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సైనాకు గట్టిపోటీ ఎదురుకాలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో సైనా తలపడుతుంది. 
 
ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అజయ్‌ జయరామ్‌ (భారత్‌) ఒకే రోజు రెండు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో జయరామ్‌ 21–10, 17–21, 21–14తో క్వాలిఫయర్‌ జున్‌ హావో లియోంగ్‌ (మలేసియా)పై, రెండో రౌండ్‌లో 21–9, 21–12తో సపుత్ర విక్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు.
 
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 15–21, 21–13, 21–18తో జియా హువో చెన్‌–చున్‌ కాంగ్‌ షియా (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొన్ని కావాలంటే కొన్ని మానేయాల్సిందేగా అంటున్న కోహ్లి