Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి చుక్కెదురు.. రియోలో సానియా సత్తా చాటుతుందా?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జం

Advertiesment
Rogers Cup
, ఆదివారం, 31 జులై 2016 (11:00 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట పోరాటం ముగిసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ ద్వయం శనివారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 4-6, 3-6తో క్రిస్టినా మెక్‌హాలె-అసియా మొహమ్మద్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 
 
టాప్ సీడ్ జంట అయిన సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ రోజర్స్ కప్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించినా ధీటుగా రాణించలేకపోయింది. దీంతో పరాజయం తప్పలేదు. ఇకపోతే.. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సానియా జోడీ మెరుగ్గా రాణించలేకపోవడం కాస్త అభిమానులను ఇబ్బందికి గురిచేసిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే రియోలో తమ సత్తా చూపించేందుకు సానియా మీర్జా రోహన్ బోపన్న, తొంబరేలతో బరిలోకి దిగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్‌కు వెళ్తున్నారా? నగలు ధరించొద్దు.. దొంగలుంటారు జాగ్రత్త..!