Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుద్ధుడిని అవమానించిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. నెటిజన్ల ఫైర్

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో బుద్ధుడిని ఘోరంగా అవమానించాడు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలు పెట్టి ఫొటోకు పోజిచ్చాడు. అనంతరం ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు. దానిని చూసి

బుద్ధుడిని అవమానించిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. నెటిజన్ల ఫైర్
, శనివారం, 22 అక్టోబరు 2016 (12:18 IST)
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో బుద్ధుడిని ఘోరంగా అవమానించాడు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలు పెట్టి ఫొటోకు పోజిచ్చాడు. అనంతరం ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు. దానిని చూసిన నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలుపెట్టి క్రిస్టియానో తన అహంకారాన్ని చాటుకున్నాడని బుద్ధిస్టులు మండిపడుతున్నారు. 
 
బుద్ధుడిని అవమాన పరిచాడంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ''క్రిస్టియానో నేను నీ అభిమానిని. నువ్వు బుద్ధుడిని గౌరవించడం నేర్చుకోవాలి. నువ్వు క్రిస్టియన్‌వా, ముస్లింవా, హిందువా? అన్నది తర్వాత. నీకు అన్ని మతాలకు చెందిన అభిమానులు ఉన్నారు. 
 
నువ్వు ఇలా చేయడం సరికాదు. నేనైతే నిన్ను క్షమిస్తా, కానీ నీ పని వల్ల మా(బుద్ధిస్టుల) మనసులు గాయపడ్డాయి'' అని పేర్కొన్నాడు. ''నీ చర్యతో ఓ అభిమానిని కోల్పోయావు'' అని ఇంకో అభిమాని పేర్కొన్నాడు. ఫొటో పోస్టు అయిన 9 గంటల్లో 1.4 మిలియన్ల లైకులు రాగా 9,40,381 మంది స్పందించారు. వీరిలో 47,677 మంది రొనాల్డ్‌ను తిట్టిపోశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్తగా ఆడాం.. అందుకే ఓడాం.. ధోనీ :: భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్