Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రో కబడ్డీ 2017: గుజరాత్‌ను చిత్తు చేసిన పాట్నా పైరేట్స్

ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్ సాధించింది. ఐదో సీజన్‌‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది.

Advertiesment
Pro Kabaddi 2017 Final
, ఆదివారం, 29 అక్టోబరు 2017 (10:40 IST)
ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్ సాధించింది. ఐదో సీజన్‌‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఫైనల్లో గుజరాత్‌ను పాట్నా చిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఫలితంగా పాట్నా జట్టు వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ 'డుబ్కీ కింగ్' పర్దీప్‌ నర్వాల్‌ 19 రైడ్‌ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఫలితంగా పాట్నా పైరేట్స్ జట్టు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అదేసమయంలో బలమైన జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్‌ టీమ్.. వరుస తప్పిదాలతో టైటిల్‌ను కోల్పోయింది. పాట్నా టీమ్‌లో పర్దీప్‌తో పాటు విజయ్‌ 7, జైదీప్‌ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సచిన్‌ 11, మహేంద్ర రాజ్‌పుత్‌ 5, చంద్రన్‌ రంజిత్‌ 4 పాయింట్లు సాధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘ఫిఫా-17’ విజేత ఇంగ్లాండ్‌.. ఫ్రెంచ్ ఓపెన్ సింధు ఓటమి