Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం

పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్ర

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం
, బుధవారం, 5 అక్టోబరు 2016 (15:23 IST)
పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్రకటన చేసింది. 
 
వాస్తవానికి ఈ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ట్రాన్స్ స్టేడియంలో జరనున్న ఈ పోటీల్లో భారత్, అమెరికా, ఇరాన్, ఆస్టేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, జపాన్, థాయ్ లాండ్ దేశాలు తలపడనున్నాయి. ఈ నెల 22వ తేదీన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
అయితే, ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా ఉండటమే మేలని భావించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐకేఎఫ్ చీఫ్ దేవ్ రావ్ చతుర్వేది వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోధా కమిటీ వర్సెస్ బీసీసీఐ: అకౌంట్లను స్తంభింపచేయడం దురదృష్టకరమన్న అనురాగ్