Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు

ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ఎందుకు కొరుకుతారో తెలుసా?
, సోమవారం, 22 ఆగస్టు 2016 (16:07 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.
 
అయితే, క్రీడా విజేతలు ఆవిధంగా చేయడానికి కారణాలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికిగాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం.
 
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ అభిప్రాయపడుతూ పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీపీ సింధుకు ఘన స్వాగతం... ఎయిర్‌పోర్టులో ఏపీ - టీఎస్ మంత్రులు క్యూ...