Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫైనల్‌లో పంచ్‌ల వర్షం - నీతూ ఘన విజయం.. మరో స్వర్ణం

Advertiesment
nitu ghanghas
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (20:16 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేసింది. బాక్సింగ్‌లో అందరూ ఊహించినట్లుగానే నీతూ ఘన్‌ఘాస్‌ దేశానికి గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 48 కేజీల బరువు విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. 
 
భారత బాక్సర్ పంచ్‌లకు ఇంగ్లండ్ బాక్సర్ వద్ద సమాధానం లేకపోయింది. మూడు రౌండ్ల పాటు సాగిన బాక్సింగ్‌లో మొదటి నుంచి చివరి వరకు నీతూ సత్తా చాటింది. మూడు రౌండ్లలో ఇంగ్లీష్ బాక్సర్ కంటే న్యాయమూర్తులు నీతూకి ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌ తరపున నీతూ 14వ స్వర్ణం సాధించింది. 
 
ఇంగ్లిష్ బాక్సర్‌తో నీతూ చేసిన పోరాటం మూడు రౌండ్ల పాటు అద్భుతంగా సాగింది. ఇద్దరి మధ్య దూకుడు తారాస్థాయికి చేరుకుంది. మూడు రౌండ్లలోనూ నీతూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రౌండ్‌లో ఐదుగురు జడ్జిలలో నలుగురు నీతూకి 10 పాయింట్లు ఇచ్చారు. రెండు, మూడు రౌండ్లలో కూడా ఇదే విధమైన ఫలితాలు కనిపించాయి. ఫలితంగా చివరికి న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు భారత బాక్సర్ నీతూకు అనుకూలంగా వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్ర సృష్టించిన భవినా పటేల్...