Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీవీ సింధును చిత్తు చేసిన జపాన్ క్రీడాకారిణి

pv sindhu
, ఆదివారం, 9 జులై 2023 (11:58 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టోర్నీలో సెమీఫైనల్లో చిత్తుగా ఓడిపోయింది. అయితే, యువ షట్లర్ లక్ష్యసేన్ మాత్రం పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరుకున్నాడు. 
 
ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి 21-14, 21-15తో పీవీ సింధును వరుస గేమ్స్‌లో ఓటమిపాలయ్యారు. దాంతో, చాన్నాళ్లుగా ఓ టైటిల్ ఆశిస్తున్న సింధుకు మరోసారి నిరాశ తప్పలేదు.
 
మరోవైపు, లక్ష్యసేన్ దాదాపు ఏడాది తర్వాత తొలి బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 21-14తో జపాన్‌కు చెందిన స్టార్ షట్లర్, నాలుగో సీడ్ కెంటా నిషిమోటోపై వరుస గేమ్స్‌లో అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షిఫెంగ్‌తో పోటీ పడనున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు.. సెప్టెంబర్ 28 నుంచి పోరు