Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్చ్... రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.

ప్చ్... రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు
, ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:17 IST)
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.
 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా ఆదివారం కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-10 తేడాతో ఓడిపోయింది. మొదటి గేమ్‌లో సింధు పోరాటపటిమతో చాలా శ్రమించిన మారిన్ రెండో గేమ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి దూకుడు ముందు సింధు నిలబడలేక పోయింది. 
 
ఫలితంగా కరోలినా మారిన్ 21-19, 21-10 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి, స్వర్ణ పతకం సొంతం చేసుకుని, ఛాంపియన్‌గా నిలిచింది. వరల్డ్ మూడో ర్యాంకర్ సింధు గత ఏడాదిలాగే ఈ సారి కూడా రజత పతకంతో సరిపెట్టుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ తర్వాత కోహ్లీకి అరుదైన గౌరవం.. ఏంటది?