Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూరోకప్‌ 2020: గుక్కపెట్టి ఏడ్చిన అమ్మాయి.. వీడియో ట్రెండింగ్

Advertiesment
Bitter
, శనివారం, 10 జులై 2021 (10:52 IST)
Euro 2020
యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్‌ తర్వాత ఒక మేజర్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే. అయితే, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ మౌంట్‌ మ్యాచ్‌ విజయంతో పాటు అభిమానుల మనసులు గెలుచుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 55 ఏళ్ల తర్వాత ఫైనల్ లోకి అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. 
 
వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్‌ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. 
 
అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. తన అభిమానికి సరైన ప్రతిఫలం దక్కడంతో ఆమె కంట ఆనంద భాష్పాలు కారాయ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - శ్రీలంక వన్డే సిరీస్‌కు కొత్త షెడ్యూల్ ఇదే....