Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి అందుకే వైదొలగాను... పీవీ సింధు

PV Sindhu
, మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:17 IST)
స్టార్ బ్యాడ్మింటన్​ ప్లేయర్ పీవీ సింధు అనూహ్యంగా ఒలింపిక్స్​ ముందు వరకు కోచ్​ పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి వైదొలగింది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింధు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 
ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశానని తెలిపింది. ఆ తర్వాత మా మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కొన్ని విషయాలు నచ్చలేదని వెల్లడించింది. 
 
నటనపై ఎటువంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో, ఆటపై మాత్రమే పూర్తి దృష్టి సారించాలని అకాడమీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఓ ప్లేయర్​ ఆడేటప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదని చెప్పింది. 
 
బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడానికి చిన్నప్పుడు సికింద్రాబాద్‌లోని మారేడ్​పల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేదని సింధు పేర్కొంది. 
 
ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేసినట్లు గుర్తుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు