Publish Date: Tue, 17 Jun 2014 (17:23 IST)
Updated Date: Tue, 17 Jun 2014 (17:24 IST)
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ భారీగా లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 331 పాయింట్ల మేరకు లాభపడి 25521 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 98 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7632 వద్ద ఆగింది.
ఇరాక్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలకు లాభాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో, ఆయిల్ కంపెనీలకు మార్జిన్లను పెంచుతారనే ఊహాగానాలతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయాయి. ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి టాప్ కంపెనీల షేర్లు పెరిగాయి.