Publish Date: Sat, 02 Apr 2016 (12:06 IST)
Updated Date: Sat, 02 Apr 2016 (12:11 IST)
తిరుమలలో రద్దీ మోస్తారుగా కనిపిస్తోంది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే పరీక్షలు ఉండడంతో భక్తుల రద్దీ తగ్గిందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. వారాంతంలో శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు. ఆ రోజు శ్రీవారిని దర్శించుకుంటే ఎంతోమంచిదని భక్తుల నమ్మకం.
దీంతో ప్రతి శనివారం భక్తులు తిరుమలకు వస్తారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఎక్కువగా భక్తులు వస్తుంటారు. శనివారం రద్దీ లేకపోవడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం శ్రీవారిని 57,133మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటల్లో స్వామిదర్శనం లభిస్తోంది.
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల్లో స్వామిదర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని హుండీ ఆదాయం 2 కోట్ల 32 లక్షల రూపాయలు ఉంది.