Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి దర్శనం కొనసాగుతుంది : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి దర్శనం కొనసాగుతుంది : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
, మంగళవారం, 21 జులై 2020 (14:59 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో పలువురు అర్చకులు కోరనా వైరస్ బారినపడ్డారు. దీంతో భక్తుల దర్శనం నిలిపివేసి... శ్రీవారికి ఏకాంతంగా మాత్రమే సేవలు నిర్వహించాలని అర్చకులు కోరుతున్నారు. అయితే, తితిదే అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. శ్రీవారి దర్శనం యధావిధిగా కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇటీవల తితిదే మాజీ ప్రధాన దీక్షితులు శ్రీనివాస దీక్షితులు ఇటీవల కరోనా కారణంగా కన్నుమూశారు. ఈ కారణంగా అర్చకులు భయపడుతున్నారు. అదేసమయంలో భక్తులు కూడా శ్రీవారి దర్శనం కోసం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని స్పష్టం చేశారు. 
 
తిరుపతి పట్టణంలో లాక్డౌన్‌ అమలులో ఉన్నందున భక్తులకు సర్వదర్శనం కోసం జారీ చేస్తున్న టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు. 'తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావొద్దు, ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు మాత్రమే దర్శనానికి రావాలి' అని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా రోజూ 9 వేల మంది భక్తులకు మాత్రమే అవకాశముందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
వచ్చే భక్తులను అలిపిరి వద్ద పరీక్షించి కొండపైకి అనుమతి ఇస్తున్నామని, జ్వరం, తదితర అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులను దర్శనానికి తీసుకురావద్దొని,మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణమాసం.. శ్రీపతికి శ్రీలక్ష్మికి మహా ఇష్టమట.. ఇలా చేస్తే?