Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే పాలకమండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డి

తితిదే పాలకమండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డి
, ఆదివారం, 29 మే 2016 (13:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అరికెల నరసారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న స్థానంలో నరసారెడ్డి కొనసాగనున్నారు. నరసారెడ్డి గతంలో నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా పనిచేశారు. 
 
తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా కూడా కొనసాగుతున్నారని, అయితే ఈ మధ్యకాలంలో నరసారెడ్డి కూడా టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న వూహాగానాలు వినిపించడంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఆలోచనకు సిఎం చంద్రబాబు వచ్చారు. పాలకమండలిలో ఒక స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానంలో నరసారెడ్డిని నియమించారు. సంవత్సరం పాటు పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి కొనసాగనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది... ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే బాగుండుననీ...