Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో శ్రీవారి దర్శనం గంటలోపే..

Advertiesment
tirumala
ఆపద్భాందవుడు, అనాథరక్షకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం గంటలోనే భక్తులకు లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా రద్దీ మాత్రం తిరుమలలో అంతగా కనిపించడం లేదు. తిరుమల కంపార్టుమెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటలోపలే దర్శనం పూర్తవుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా అదేసమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 70,269 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వసూలైంది. 

Share this Story:

Follow Webdunia telugu