Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో మోస్తారుగా పెరిగిన భక్తుల రద్దీ

Advertiesment
tirumala devotee's
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 5 గంటలు పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. 
 
మరో రెండురోజులు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు భావిస్తున్నారు. గురువారం శ్రీవారిని 60,804 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.96 కోట్లుగా వసూలైంది. 

Share this Story:

Follow Webdunia telugu