Publish Date: Mon, 02 May 2016 (10:55 IST)
Updated Date: Mon, 02 May 2016 (10:57 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమలకు చేరుకున్న భక్తులకు సోమవారం కూడా దర్శన భాగ్యం లభించకపోవడంతో కంపార్టుమెంటులోనే వేచి ఉన్నారు. గదులు కూడా తిరుమలలో దొరకడం లేదు. తలనీలాలు వచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. తలనీలలు సమర్పించుకునేందుకు గంటల తరబడి సమయం పడుతోంది.
సోమవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమంట్లలో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటలు పడుతోంది. ఆదివారం శ్రీవారిని 84,128 మంది భక్తులు దర్శించుకున్నారు.