Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Advertiesment
tirumala crowd
వరుసగా మూడురోజుల పాటు సెలవు దినాలు రావడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఉగాది తర్వాత వరుసగా సెలవులు ఉండడంతో ఒక్కసారిగా తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహంగా కనిపిస్తోంది. సోమవారం ఉదయానికన్నా భక్తుల రద్దీ తగ్గుతుందని భావించారు. అయితే భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 
 
సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 గంటలకుపైగా సమయం పడుతుండగా కాలినడక భక్తులు 6 గంటలకుపైగా సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 75,854 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వసూలైంది. 

Share this Story:

Follow Webdunia telugu